మదనపల్లె స్థానిక కదిరి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన ఉత్సావాల్లో భాగంగా గురువారం ఆలయంలో కలశారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయకమిటీ అధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణాచారి, నవయుగ స్వర్ణకారుల సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అప్పినిపల్లె భాస్కరాచారిలు నిర్వహించారు. గురువారం ఉదయం 5.30 గంటలకు సుప్రభాత సేవ, 9గంటలకు నాగదేవతల ఆరాధన, స్వామివార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో కలశారాధనతోపాటు హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు మహామంగలహారతి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతోపాటు విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa