రాయలసీమ, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ చత్తీ్సగఢ్ నుంచి కోస్తా, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ తీరం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. నంద్యాలలో 10.5 సెంటీమీటర్లు, బేతంచర్ల మండలం రంగాపురంలో 9.35, చాగలమర్రి మండలం ముత్యాలపాడులో 8.5, బాపట్ల జిల్లా గూడవల్లిలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా ఈ నెల 23 వరకు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వివరించింది. కాగా నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు వర్షాలు కురవడం సాధారణమేనని, ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఆలస్యంగా వచ్చాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా.. రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ఛత్తీ్సగఢ్ నుంచి కొమరిన్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మారిన వాతావరణంతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa