ఏపీలో పలు నియోజకర్గాల్లో పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రాచమల్లు బావమరిది మునిరెడ్డిపైనా కేసు నమోదైంది. సీఐని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ రూపొందించారు. నిన్న ప్రొద్దుటూరు పోలీసులు కొందరు వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు పోలీసుల అనుమతి లేకుండా ఓ వైసీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ఫిర్యాదుతో ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa