ఎయిడ్స్ వ్యాధి లేని సమాజాన్ని నిర్మిద్దామని ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్న ప్రజలకు సాయం చేసిన వారిని గుర్తిద్దామని అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా జిల్లా కుష్టు, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ శైలజ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాయచోటిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డైట్ కళాశాల వరకు ప్రేమ, సంఘీభావంతో మనందరం గుర్తుంచుకుందాం. మనందరం నయం చేసుకుందాం అనే థీమ్తో దీపపు వెలుగుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే నెల మూడవ ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. హెచఐవీ లేదా ఎయిడ్స్ వ్యాధితో ఎంతో మంది ప్రాణాలు, జీవితాలను కోల్పోయారని, వారి జ్ఞాపకార్థం, హెచఐవీతో జీవిస్తున్న ప్రజలకు సహాయం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారి సేవలను గుర్తించడం కోసం, సమాజంలో హెచఐవీ లేదా ఎయిడ్స్ వ్యాధి వల్ల కలిగే సామాజిక, ఆర్థిక నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మోమోరియల్ డే నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో హెచఐవీ లేదా ఎయిడ్స్ వ్యాధితో ఏఆర్టీ కేంద్రంలో గత 20 ఏళ్లలో సుమారుగా ఒక లక్షా 40 వేల మంది మరణించారని, ప్రస్తుతం సుమారు 2,22,300 మంది మందులు వాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు. వీరికి వైద్య చికిత్స, ఔషధాలు ఆంధ్రప్రదేశ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ద్వారా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూపీహెచసీ వైద్యాధికారులు, క్షయ వ్యాధి నివారణ విభాగపు సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa