ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమబెంగాల్‌లో పర్యటించిన ప్రధాని

national |  Suryaa Desk  | Published : Tue, May 28, 2024, 08:12 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్, బారాసత్‌లో మంగళవారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కోర్టుల తీర్పులను అమలు చేసేది లేదని టీఎంసీ చెబుతుండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు అనూకూలంగా తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై గూండాలను సైతం ఉసిగొలుపుతారా? అని ప్రశ్నించారు.పశ్చిమబెంగాల్‌లో 2010 నుంచి వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఓబీసీ స్టాటస్‌ను కోల్‌కతా హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పును మమతా బెనర్జీ తప్పుపట్టారు. తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు తీర్పుపై బీజేపీ ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. 2010 తర్వాత మంజూరు చేసిన ఈబీసీ సర్టిఫికెట్లు చెల్లవంటూ కోల్‌కతా హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యం కాదని టీఎంసీ ప్రకటించడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారు. తమ మోసాలు, అబద్ధాలు బహిర్గతం కావడం టీఎంసీకి ఇష్టం ఉండదని, న్యాయవ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల వారికి విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు. తమ మోసాలు బయటపెట్టిన న్యాయమూర్తులపై కూడా గూండాలను ఉసిగొల్పుతారా అనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. కేవలం తమ ఓటు బ్యంకును కాపాడుకునేందుకే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సాధువులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇటీవల కామెంట్లు చేశారని మోదీ తప్పుపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa