విజయనగరం జిల్లా, ఎస్.కోట గ్రామస్థుల ఇలవేల్పు శ్రీదార గంగమ్మ అనుపు సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త మోపాడ గౌరినాయుడు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు అగ్నిహోత్రుల రాజగోపాలచార్యులు అమ్మవారికి పూ జలు చేయగా రాష్ట్రం నలుమూలలనుంచి పండుగకు హాజరైన భక్తులు అమ్మవా రిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్థానిక గొల్లవీధిలో ఉన్న అమ్మవారి ప్రతిమను ఆలయ ధర్మకర్త మోపాడ గౌరినాయుడు తలకు ధరించగా సంబరానికి శ్రీకారం చూట్టారు. అనాది ఆచారంగా వస్తున్న స్థానిక పద్మ శాలీలు తయారుచేసిన అమ్మవారి పండగకు ఉరేగించే ప్రభను పట్టణానికి చెంది న ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ సత్యశేఖర్ ధరించగా ఉరేగించారు. ఈ ఉత్స వంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, సుధారాజు దంపతులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పండగలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ మురళీరావు చక్కటి ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa