మడకశిర పట్టణ సమీపంలో కర్ణాటక ప్రాంతంలోని ప్రసిద్ధి గాంచిన సిద్దర బెట్ట పుణ్యక్షేత్రంలో జూన 9వ తేదీన జరిగే ఉచిత సామూహిక వివాహాలకు మడకశిర నియోజకవర్గంలోని వారు దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పే స్వామి కోరారు. సిద్దరబెట్ట పీఠాధి పతి వీరభద్ర శివాచార్య స్వామితో కలిసి ఆయన గురువారం పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. సిద్దరబెట్ట పుణ్యక్షేత్రం వార్షికోత్సవంలో భాగంగా ఉచిత సామూహిక వివాహలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహం చేసుకోవాలని సంకల్పించేవారు సిద్దరబెట్ట మఠంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం వార్షికోత్సవాలు, సామూమిక వివాహాల వాల్పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచి మంజునాథ్, టీడీపీ మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, రవికుమార్, జయదేవ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa