ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదముగా వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 31, 2024, 05:04 PM

ఇంటి ఆవరణలో ఉన్న సంపులో నుంచి నీటిని తోడేందుకు యత్నిస్తూ అందులో పడి రిటైర్డ్‌ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా, కంచికచర్ల నంబూరి వారి బజారుకు చెందిన బీఎస్‌ఎన్‌ ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి తోటకూర వెంకటేశ్వరరావు(74) హైదరాబాద్‌లో పెద్దకుమార్తె పద్మావతి వద్ద ఉంటు న్నాడు. పింఛన్‌ కోసం సొంత ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి స్నానం చేసేందుకు సంపులో నుంచి నీటిని తోడుతుండగా అందులోకి జారిపడి మృతి చెందాడు. కుమార్తె పద్మావతి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa