పెనమలూరు నియోజకవర్గ ప్రత్యేక పోలీసు అధికారిణిగా ఎస్పీ రజిని బాధ్యతలు చేపట్టారు. జూన్ 4న జరగనున్న కౌంటింగ్ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో భాగంగా ప్రత్యేక అధికారిణిగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం స్థానిక పోలీసు అధికారులతో ఆమె మాట్లాడుతూ, బందోబస్తు ఏర్పాట్లను, సిబ్బంది సన్నద్ధత, నియోజకవర్గ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళిని, సెక్షన్144, 30పోలీసు యాక్టును కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించేవారు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని, సమస్యాత్మక గ్రామాలలో పోలీసు అధికారులు తరచూ పర్యటించాలని, రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్పై నిఘా ఉంచి, పొలిటికల్ పార్టీల సోషల్ మీడియా యాక్టివిటీలను గమనిస్తూ ఉండాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ సుభాష్, సీఐలు రామారావు, శ్రీనివాసరావు, హబీబ్ బాషా, ఎస్సైలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa