ప్రభాస్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ రేపు (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆరో ఆటకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో కల్కి చిత్రం ఆరో ఆటకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రేపు ఒక్కరోజు మాత్రమే ఆరో ఆటకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఉదయం 4.30 నుంచి 8 గంటల వరకు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
మరోవైపు కల్కి సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా అదనపు షోలకు సైతం పర్మిషన్ ఇచ్చారు. విడుదల అయిన రోజు నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ల్లో రూ.125 వరకు పెంచుకునే వెసలుబాటు ఇచ్చారు. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. తాజాగా రేపు ఒక్క రోజు ఆరో రోజు ఆట కూడా ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇచ్చింది.
ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీపై క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు భారీ తారాగణం ఉంది. కమల్ హాసన్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, రానా సహా పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. మరోవైపు వరుస ఫ్లాపులతో ఉన్న ప్రభాస్.. సలార్ మూవీతో హిట్ కొట్టారు. ఇక కల్కి సినిమాతో రికార్డులను తిరగరాస్తాడని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa