బీసీ వసతి గృహాలకు సౌకర్యాలు మెరుగుపరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత గారికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ వినతి. శింగనమల నియోజకవర్గ పరిధిలోని బీసీ వసతి గృహలలో సౌకర్యాలు మెరుగుపరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవిత గారికి శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ వినతిపత్రం అందజేశారు.నిన్నటి రోజున పెనుకొండలోని రోడ్లు భవనాల అతిథి భవనంలో మంత్రి సవిత గారికి కలిసి శింగనమల నియోజకవర్గ పరిధిలోని బీసీ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలియజేసి,మెరుగుపరిచేందుకు కృషి చేయాలని మంత్రి గారికి వినతిపత్రం అందజేశారు.అలాగే శింగనమల నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరిగే గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి గారిని ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa