కార్యకర్తలకు భద్రత, భరోసా కల్పించే క్రియాశీలక సభ్యత్వంలో అందరూ భాగస్వామ్యం కావాలని జనసేన నేత నాగబాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో నుంచి పుట్టిన గొప్ప ఆలోచన ‘‘కార్యకర్తలకు బీమా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల వేరు వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 81 మంది క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.4.05 కోట్ల బీమా చెక్కులను మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ‘‘ఎందరో కొడుకులని కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నా చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇస్తూ వారిని ఓదార్చినప్పుడు నా కళ్ళు చమర్చాయి’’ అంటూ నాగబాబు ఎమోషనల్ అయ్యారు. బాధిత కుటుంబాలకు వారు కోల్పోయిన మనిషిని వెనక్కి తీసుకురాలేము కానీ, వారి బాధలను ఒక కుటుంబ సభ్యునిగా నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చేది ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వమని చెప్పుకొచ్చారు. ఒక కుటుంబాన్ని జనసేన పార్టీతో మమేకం చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ పవిత్ర కార్యక్రమంగా భావించాలన్నారు. నిర్ణయించిన గడువు వరకు నిబద్ధతతో సభ్యత్వాలను చేయించాలని కోరారు. బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే ప్రక్రియలో అందరూ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో తోడు నడవాలని జనసేన నేత నాగబాబు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa