ఎల్లుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. భారీ వరదల నేపథ్యంలో ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జల హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు.గంగమ్మకు చీరే సారే సమర్పించి జల హారతిని సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఇన్ ఫ్లో : 4,60,040 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 880.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 198.3623 టీఎంసీలకు చేరుకుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుకు చెందని మూడు గేట్లను ఎత్తి దాని ద్వారా నాగార్జునసాగర్కు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పర్యాటకుల సందడి నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో : 81,634 క్యూసెక్కులు. ఎనిమిది టర్బయిన్స్లలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా..ప్రస్తుల నీటి మట్టం 514.60 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 139.61 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం14.70. అడుగులకు తగ్గింది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 14 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa