యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరద ముంపు గ్రామంలో పశువుల దానా ను రైతులకు పంపిణీ చేశాను. సుమారు మూడు లక్షల విలువ గల పదిటన్నుల దానా ను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వరద బాధితులతో పాటు రైతులను పలకరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పులపాలు చేసిందని స్వయంగా ఎన్.ఐ.పి.ఎఫ్.సి తాజా నివేదిక వెల్లడించింది.జగన్ రాష్ట్రాన్ని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను లక్షల కోట్ల అప్పులకు తాకట్టు పెట్టాడని మేం చెప్పడం లేదు జి ఎస్ డి పీ లో రాష్ట్ర అప్పుల వాటా 36శాతంగా తెలిపింది.ఒకటో తేదీన ఒక్క రోజులోనే ఫించన్ల సొమ్ముతోపాటు ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల కింద మొత్తం గా ఎనిమిది వేల మూడువందల కోట్లు పంపిణీ చేసాం.ఎన్డీఏ ప్రభుత్వం ఒకే రోజు రికార్డు స్థాయిలో వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులకు ఫించన్లు, ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు పంపిణీ చేస్తే తట్టుకోలేని జగన్ సొంత సాక్షి రోత పత్రిక అసత్యాలు, అబద్ధాలు, అర్థసత్యాలు పోగేసి రాస్తుంది.చంద్రబాబు రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఒకటో తేదీనే ఫించన్ దారులతోపాటు ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందించారు. భారీ వర్షాలు,వరద ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు కాయగూరలతో పాటు వరద నీరు ఇళ్లల్లోకి వెళితే మూడు వేలు నగదు అందజేశాం.ముంపు ప్రాంతాల్లో మూగజీవాలైన పశువులకు దానా సైతం పంపిణీ చేస్తున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa