పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో ఇండియాకు గోల్డ్ మెడల్ వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు. కానీ, ఫైనల్లో తడబడ్డ అతడు 89.45 మీటర్లు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు. ఇక గత ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్లు బల్లెం విసరగా.. అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో ఇద్దరు కూడా ఫౌల్ అయ్యారు. రెండో ప్రయత్నంలో దీన్ని సాధించారు. అయితే అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అతడికి డోప్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో గురువారంఅర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరి రికార్డులను బద్దలు కొట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గతంలో అనగా 2008 బీజింగ్ గేమ్స్లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్సెన్ నెలకొల్పిన 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డును నదీమ్ అధిగమించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa