ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి రహిత భారతే లక్ష్యం: రామ్‌నాథ్ కోవింద్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 02:23 PM

అవినీతి రహిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన గురువారంనాడు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం నవ భారత్ నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటానికి ఎంతో కృషి చేసిందని చెప్పారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా 9కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, దీనివల్ల 3 లక్షల కుటుంబాలకు ఆరోగ్యం చేకూరిందని అన్నారు. కట్టెల పొయ్యిలతో వంటలు చేసే మహిళలు మరింత అనారోగ్యం పాలుకాకుండా కాపాడేందుకు ఉజ్వల పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యభీమా పథకాన్ని అమలుచేస్తున్నామని, కిడ్నీ బాధితులకు ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అలాగే జన ఔషది దుకాణాలను ఏర్పాటు చేసి తక్కువ ధరకు మందులను అందజేస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద లక్షమందికి నివాసయోగ్యం కల్పించామని చెప్పారు. గృహ నిర్మాణాల్లో సమస్యలు తొలగించేందుకు రేరా చట్టం అమలులోకి తెచ్చామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa