ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.1000 కోట్ల విలువైన భూమి దానం.....పూసపాటి వంశీయుల పెద్దమనసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 21, 2025, 07:30 PM

పూసపాటి వంశీయులు మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. భావితరాల భవిష్యత్ కోసం సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని దానంగా అందించారు. విశాఖపట్నం - విజయనగరం సరిహద్దుల్లోఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీనిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. జీఎంఆర్ గ్రూప్. మాన్సాస్ ట్రస్టు ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఇటీవలే మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్ - మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 160 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఏవియేషన్ ఎడ్యు సిటీ కోసం పూసపాటి వంశీయులు రూ.1000 కోట్లు విలువైన భూమిని దానంగా అందించారు.


ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు కోసం 136.63 ఎకరాలు భూమిని అందించేందుకు మాన్సాస్ ట్రస్టు ముందుకు వచ్చింది. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద ఉన్న ఈ భూమిని ఏవియేషన్‌ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు పూసపాటి వంశీయురాలు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జీఎంఆర్ - మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు పూసపాటి రాజవంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని అదితి గజపతిరాజు కోరారు.


 మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురం వద్దఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. 2026 మే లేదా ఆగస్ట్ నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు విమానయాన శాఖ చర్యలు చేపడుతోంది. అయితే విమానయాన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా.. భోగాపురం సమీపంలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏవియేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల బ్రాంచ్‌లను ఇక్కడ ఏర్పాటు చేయించాలని లక్ష్గంయా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రైతుల వద్ద నుంచి సేకరించిన భూమి లేదా ప్రభుత్వ భూములలో ఈ ఎడ్యు సిటీని ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయం తీసుకుంది.


అయితే ఈ ఏవియేషన్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు విలువైన 136 ఎకరాల భూమిని అందించేందుకు మాన్సాస్‌ ట్రస్ట్‌ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మాన్సాస్ ట్రస్టు తరుపున ఏవియేషన్‌ ఎడ్యుసిటీకి 136.63 ఎకరాలు కేటాయించేలా దేవాదాయశాఖ అనుమతి ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa