ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. నేడు, డిసెంబర్ 21, ఆదివారం నాడు జగన్ తన 53వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. జగన్ బర్త్డే సందర్భంగా వైసీపీ నేతలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల ఎక్స్ (X) వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మేరకు పవన్ తన ఎక్స్ ఖాతాలో.. 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని రాసుకొచ్చారు.
అలానే ఏపీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ షర్మిల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రెండు పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. షర్మిలకు, జగన్కు మధ్య గత కొన్నాళ్లుగా మాటలు లేవు.
ఇదిలా ఉంటే జగన్ బర్త్ డే సందర్భంగా.. రాజమండ్రి వైసీపీ నేతలు నగరంలో.. మాజీ సీఎం భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. తాడేపల్లిలో.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన వైఎస్ జగన్ కటౌట్ ఇప్పుడు నెట్టింట నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ వ్యక్తి వైఎస్ జగన్ మీద అభిమానంతో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa