గ్రామ పంచాయతీ లో పరిశుభ్రత, పచ్చదనం పాటిస్తే ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు మదనపల్లి డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఆర్ వన యా ప్ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు పార దర్శకత పాటించాలని డీపీవో సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమా వేశ భవనంలో సర్పంచలు, పంచాయతీ కార్య దర్శులకు రెండో రోజు ఆర్జీఎస్ఏ పథకం శిక్ష ణ తరగతులు నిర్వహించారు.ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణ, పచ్చదనంతో చక్కగా ఉంటే గ్రామ పంచాయతీలకు జిల్లా కలెక్టర్ రూ.25వేలు అవార్డు ప్రకటిస్తారన్నారు. పారి శుధ్యంపై స్పెషల్ డ్రైవ్ ఈనెల 10న ముగిసినా, దీన్ని నిరంతరంగా కొన సాగిస్తామన్నారు. ప్రజారోగ్యం కాపాడటానికి మరుగుకాలువలను శుభ్ర పరచడం, బ్లీచింగ్ చల్లడం, తాగునీటి పథకాలను క్లోరినేషన చేయించాలన్నారు. ఈనెలాఖరులోపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్లను ఉపయో గంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో భానుప్రసాద్, సర్పంచలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa