ఏపీవాసులకు అలర్ట్.. మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరోవైపు ఆగస్ట్ 29వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే మూడురోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాలలో కొన్నిచోట్ల మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
ఇక దక్షిణకోస్తా జిల్లాల విషయానికి వస్తే మంగళవారం, బుధవారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇక రాయలసీమ జిల్లాల సంగతికి వస్తే మంగళవారం, బుధవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa