ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారుల (2022 బ్యాచ్)కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ఎనిమిది మంది సబ్ కలెక్టర్లుగా నియమించింది.. సెప్టెంబరు 9వ తేదీలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోగా అభిషేక్ కొనసాగుతారు.. ప్రస్తుతం బాపట్ల జాయింట్ కలెక్టర్గా ఉన్న బి.సుబ్బారావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ప్రఖార్ జైన్ బాధ్యతలు చేపడతారని ఉత్తర్వుల్లో తెలిపారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా గొబ్బిల విద్యాధరిని నియమించారు.
ఇక మిగిలిన అధికారుల విషయానికి వస్తే.. బి.సహేదిత్ వెంకట్ త్రివినాగ్ను మార్కాపురం సబ్ కలెక్టర్గా, పాలకొండ సబ్ కలెక్టర్గా యశ్వంత్ కుమార్ రెడ్డి, నర్సీపట్నం సబ్ కలెక్టర్గా కేఆర్ కల్పశ్రీ, పెనుకొండ సబ్కలెక్టర్గా మంత్రి మౌర్య భరద్వాజ్, గూడూరు సబ్ కలెక్టర్గా రాఘవేంద్ర మీనా, పాడేరు సబ్ కలెక్టర్గా శౌర్యమన్ పటేల్, కందుకూరు సబ్ కలెక్టర్గా తిరుమాణి శ్రీపూజ, తెనాలి సబ్ కలెక్టర్గా సంధ్యనా సిన్హాను నియమించారు.
పీఆర్సీ నియమించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 12వ పీఆర్సీ (వేతన సవరణ కమిషన్)ని (పీఆర్సీ)ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పాత శ్లాబుల ప్రకారం పింఛను చెల్లించాలని.. ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత సదుపాయాలను వెంటనే చెల్లించాలని.. అంతేకాదు పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇటు విద్యుత్ సంస్థల్లో బదిలీల కసరత్తు మొదలైంది. ప్రజలతో నేరుగా సంబంధాలున్న విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఒకే చోట ఐదేళ్లు, అంతకుమించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు బదిలీల మార్గదర్శకాల ప్రకారం సిబ్బంది జాబితాను విద్యుత్ సంస్థలు సిద్ధం చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa