అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి గత రెండు రోజులుగా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడగా.. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ ఉదయాన్నే ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఊహించని రీతిలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన ఇలా ఉండగానే.. మరో కీలక పరిణామం వైసీపీ భారీగా కుదిపేసింది. వైసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత సంచలన ప్రకటన చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్కు సునీత ఓ లేఖ రాశారు. గతంలో టీడీపీలోంచి వైసీపీలో చేరిన సునీత.. ఇప్పుడు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో వైసీపీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చే ఆ పార్టీ నేతలు ఇలా వరుసగా జంప్ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa