ఎదుళ్లవాగు వరద ఉద్ధృతికి తిరువూరు రూరల్ మండలం టేకులపల్లి సమీపంలోని వంతెనకు ఇరువైపులా గండ్లు పడ్డాయి. అలాగే టేకులపల్లి- చౌటపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి ఆరు అడుగుల మేర లోతుకు కోతకు గురైంది. దీంతో ఈ రెండు మార్గాల్లో రాకపోకలు ఐదు రోజులుగా నిలిచాయి. రాకపోకలు నిలిచిపోవడంతో చింతలపాడు, గానుగపాడు మీదుగా ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. తిరువూరు రూరల్ మండలం మల్లేల వద్ద వాగు ఉద్ధృతికి అలుగుపడి జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు అనుమతించారు. తిరువూరు -అక్కపాలెం రహదారిలో చెరువుల వరద ఉద్ధృతికి కరకట్ట, ప్రధాన రహదారికి గండ్లు పడ్డాయి. రహదారి పలు చోట్ల కోతకు గురైంది. దీంతో ఆంధ్రా- తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa