మద్యం మత్తులో మందుబాబులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు నాన్-స్టాప్గా వాగుతూ ఉంటే.. మరికొందరు తమకు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తారు. పిచ్చిచేష్టలతో ఏం జరుగుతుందో ఒంటిపై సోయకూడా ఉండదు. అయితే, ఓ యువతి మాత్రం ఫుల్లుగా మందుకొట్టి.. ఆ మైకంలో తనను తాను మర్చిపోయింది. తాను వెళ్లాల్సింది ఓ దేశానికి అయితే... మరో దేశానికి వెళ్లే విమానం టికెట్ కొనుగోలు చేసింది. మత్తులో జోగుతూ విమానం ఎక్కిన ఆమెకు.. పైలట్ హిందీలో మాట్లాడటంతో ఒక్కసారి మైకం దిగిపోయింది. తాను బుక్ చేసిన విమానం జార్జియాకు వెళ్లదని అప్పుడు తెలిసింది.
హిందీలో ప్రయాణికులకు పైలట్ సూచనలు చేయడంతో ఆమె ఉలిక్కిపడింది. ఆమెకు అప్పుడే తెలిసింది తాను జార్జియా వెళ్లాల్సిన విమానానికి బదులు భారత్కు వెళ్లే విమానంలో టిక్కెట్ బుక్ చేశానని. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మీరు మద్యం మత్తులో జార్జియా వెళ్లాలని విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నారు. మీరిప్పుడు విమానంలో కూర్చున్నారు.. అసలు మీకు తెలుసా? నిజానికి ఈ విమానం భారత్కు వెళ్తోందని’ అని ఆ వీడియోపై రాసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఈ ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మద్యం తాగినా కూడా విమానంలోకి అనుమతిసారా? అని ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఎలాగూ భారత్కు వస్తున్నారు కాబ్టటి ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయని, వాటిని చూసి వెళ్లాలని కామెంట్ చేశారు. ‘భారత్కు వెళ్లడానికి మీకు వీసా అవసరం.. ఇది చాలా మంది అమెరికన్లకు అర్థం కాలేదు. కాబట్టి, మీరు భారతదేశంలోకి రాలేరు’ ఇంకొకరు. అన్నారు. కొందరైతే ఆ యువతి కంటే బోర్డింగ్ పాస్ జారీచేసిన వ్యక్తే ఎక్కువగా తాగి ఉంటాడని, అందుకే ఈ పొరపాటు జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, మద్యం మత్తులో విమానం ఎక్కి.. తోటి ప్రయాణికులపై మూత్రం పోయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa