జనసేన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ను వెంటనే మార్చాలని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్యనాయకులు కోరారు. ఆయన కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, పార్టీ ఆశయాలకు భిన్నంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. స్థానిక లాయర్పేటలోని డొక్కా సీతమ్మ క్యాంటిన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల ఇన్చార్జిలు బెల్లంకొండ సాయిబాబు, ఇమ్మడి కాశీనాథ్, కందుకూరి వెంకటేశ్వరరావు(బాబు), బటుకు రమేష్, జనసేన పార్టీ సెం ట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేం ద్రయాదవ్లు మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్ జిల్లా అధ్యక్షుడి మార్పు ను కోరుకుంటున్నదని, త్వరలోనే అధినేత పవన్కల్యాణ్ను కలుస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa