ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయికి టీడీపీ నేత సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 11:28 PM

వైసీపీ నాయకులు గత ఐదేళ్లలో చేసిన కబ్జాల వల్ల బుడమేరు వరద నీరు విజయవాడలోకి వచ్చి విధ్వంసం సృష్టించిందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. బుడమేరు ఆక్రమణలను ఇప్పటికైనా తొలగించకపోతే భవిష్యత్తులో విజయవాడ పట్టణానికి మరిన్ని విపత్తులు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డికి విజయవాడ ప్రజలు ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు చేసిన ఆక్రమణలు ముఖ్యమో? తేల్చుకోవాలని సవాల్ విసిరారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరు బుడమేరు ఆక్రమణల తొలగింపునకు చంద్రబాబు అద్దె ఇంటికి లంకె పెట్టరని నాదెండ్ల బ్రహ్మం అన్నారు. చంద్రబాబు అద్దెకు ఉన్న ఇల్లు ఆయన సొంతం కాదని ముందుగా పులివెందుల ఎమ్మెల్యే అతని బ్యాచ్ తెలుసుకోవాలని అన్నారు. బుడమేరు ఆక్రమణలు తొలగించవద్దని.. దమ్ముంటే సాయిరెడ్డి విజయవాడ నడిబొడ్డున నిలబడి చెప్పాలని నాదెండ్ల బ్రహ్మం సవాల్ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa