గత ప్రభుత్వం తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ఎవరికి లాభం కలిగిందో అందరికి తెలుసని మంత్రి సత్యకుమార్ అన్నారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి వారి ఆరోగ్యంతోనూ చెలగాటమాడారని మండిపడ్డారు. 2019-24 మధ్య ప్రజల ఆరోగ్యం మద్యం వల్ల ఎంతో దెబ్బతిన్నదన్నారు. చివరకు మద్యం ఆదాయంపైనా ఎస్క్రూ చేసేశారన్నారు. కాలేయ సంబంధిత వ్యాదులు, కిడ్నీ సంబంధిత వ్యాదులు 2019-24 మధ్య భారీగా పెరిగిపోయాయన్నారు. మద్యం లేకపోతే గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మందులు వాడేలా వెళ్లిపోతారన్నారు. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీలో జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa