సినీ నటి జెత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరువు పోయిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విషయంలో రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పని చేసి కొంతమంది ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని జీవీ మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడేపల్లి దొంగల కోసం వారు సిగ్గు విడిచి పనిచేశారని ఎమ్మెల్యే ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థంకావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు. సమాజంలో ఇంత కన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన శ్రీలక్ష్మి లాంటి వాళ్లను చూశామని, అలాంటి వారు కటకటాల పాలైనా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ల్లో మార్పు రావడం లేదని ఆయన అన్నారు. ఓ మహిళను వేధించేందుకు ఇంతమంది అధికారులు కుట్రపన్ని పని చేశారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోందని జీవీ అన్నారు. ఇలాంటి దారుణాలకు ఎన్డీయే ప్రభుత్వంలో అవకాశం లేదని, మహిళపై వేధింపుల విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పని చేసిన అధికారులంతా జైలుకు పోవడం ఖాయమని ఎమ్మెల్యే జీవీ జోస్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa