ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదమెక్కి మాట్లాడకు పొన్నవోలూ.. జాగ్రత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 05:01 PM

మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పందికొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందని, తక్కువ ధర గల నెయ్యిలో ఎలా కలుపుతారని పొన్నవోలు అంటున్నారు. భక్తుల మనోభావాలను మరింత దెబ్బకొట్టేలా ఆయన మాటలున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే రికార్డులు తనకు పంపించాలంటున్నారు. మరో మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుమలలో పెద్ద యాక్టింగ్‌ చేశారు. ఇంత పెద్ద అపచారం జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారు?’’ అని పవన్‌ నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa