ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌ఈఈడీఏపీ చైర్మనగా గూనపాటి దీపక్‌రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 08:03 PM

రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (ఎస్‌ఈఈడీఏపీ) చైర్మనగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ గూనపాటి దీపక్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 2021 శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల స్థానం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలెక్ట్‌ కమిటీలో దీపక్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డికి దీపక్‌ రెడ్డి అల్లుడు. వైసీపీ పాలనలో జగన ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత నారా లోకేశకు సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి హోదాలో నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. పాదయాత్ర ప్రారంభం నుంచి ముగిసేదాకా లోకేశ వెన్నంటే నడిచారు. పాదయాత్రలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. నారా లోకేశ నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa