తిరుమల లడ్డూని కల్తీ చేసి వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు ఆయణ్ని క్షమించరని అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. "జగన్ హయాంలో లడ్డూ తయారీ నాణ్యతలో వైసీపీ నేతలు రాజీపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి నేతి సరఫరాలో నిర్లక్ష్యం వహించారు. పవిత్రమైన ప్రసాదంలో కొవ్వు కలిపి అపవిత్రం చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయ్యింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు. టీటీడీ ఆస్తులు వేలం వేసేందుకు యత్నించారు. శ్రీవారి నిధులు దారి మళ్లించేందుకు కుట్రలు చేశారు. వాటి కన్నా ఇప్పుడు చేసిన నేరం అమానుషం. ఈ అపచారం చేసిన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa