ఖర్జూరంలో సహజ చక్కెరలు, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తింటే మంచి ఎనర్జీ బూస్ట్ లభిస్తుందంటున్నారు నిపుణులు. ఖర్జూరంలో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.ఈ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు.. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది.నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. మన శరీరంలోని క్షీణించిన కణజాలాలను తిరిగి రిపేర్ చేస్తుందంటున్నారు. అలాగే.. ఖర్జూరం, నెయ్యి రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా గర్భిణులు ఇది తినడం వల్ల గర్భాశయం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. ఫలితంగా సుఖ ప్రసవం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నెయ్యితో నానబెట్టిన ఖర్జూరాలు ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళన, గుండె దడ లాంటి సమస్యల నివారణకు కూడా నెయ్యి ఖర్జూరం మిక్స్ ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి ఖర్జూరాలు మేలు చేస్తాయి. నెయ్యిలో ఖర్జూరాలను ఎలా నానబెట్టాలి అనే విషయంలోకి వెళితే.. ముందుగా 10 నుంచి 12 విత్తనాలు లేని ఖర్జూరాలు తీసుకొని వాటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కాస్త వేడి అయ్యాక ఖర్జూరాలు వేసి లో ఫ్లేమ్ మంట మీద కాసేపు వేయించుకోవాలి. వేయించిన ఖర్జూరాలను చల్లార్చుకొని నెయ్యితో సహా ఒక గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa