రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో చిరుతపులి ఇప్పటి వరకు ఏడుగురిని బలితీసుకున్నట్లు తెలుస్తోంది. మనుషులపై తరచుగా దాడి చేసే ఈ చిరుతపులిని చంపేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa