ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తల్లి అంజనీ దేవి ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్కు పట్టుదల ఎక్కువని.. తను ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేసేవాడని చెప్పుకొచ్చారు. గతేడాది చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన కుమారుడు పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకోవడం చూసి బాధ కలిగిందన్నారు. పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాలను కూడా అంజనీ దేవి గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ తల్లి అంజనీ దేవి జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో పాటూ .. చిన్ననాటి విషయాలను చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూ ప్రొమోను 'అమ్మ మనసు' పేరుతో జనసేన పార్టీ అధికారిక 'ఎక్స్' అకౌంట్లో ట్వీట్ చేసింది. ఈ ఇంటర్వ్యూకలో 'మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్నగా మారారని' రిపోర్టర్ వ్యాఖ్యానించగా... అంజనీ దేవి ఆనందంగా కనిపించారు. ఈ ఇంటర్వ్యూ ఇవాళ (బుధవారం) సాయంత్రం 6 గంటలకు జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయబోతున్నారు. అంజనీ దేవి ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో.. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. పవన్ కళ్యాణ్కు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా.. టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు.. భక్తులతో కలిసి భోజనం తిన్నారు. పవన్ కళ్యాణ్ గురువారం కూడా తిరుమలలోనే ఉంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి విజయవాడకు రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa