విజయవాడ వరద బాధితుల అవస్థలు చూసి ప్రపంచ వ్యాప్తంగా దాతలు చలించిపోయి విరాళాలు అందజేస్తే, కూటమి నేతలు వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి రూ.534 కోట్లకు తప్పుడు లెక్కలు చూపి మొత్తం దోచేశారని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆక్షేపించారు.
వరదలను పబ్లిసిటీ కోసం వాడుకోవడమే కాకుండా, వరద సాయంలోనూ అవినీతి చేయొచ్చని కూటమి ప్రభుత్వం చూపిందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. వరద బాధితులకు ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండానే రూ.1.40 కోట్లు ఖర్చు చేశామని తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa