తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యగమనిక.. పాపికొండల విహారయాత్ర ప్రారంభమైంది. జులై 13 నుంచి గోదావరి వరదల కారణంగా పాపికొండల విహారయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే.. ఈ యాత్రకు తిరిగి ఇవాళ శ్రీకారం చుట్టారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులతో మూడు బోట్లలో వెళ్లి శుక్రవారం రోజు మాక్ డ్రిల్లో నిర్వహించి పరిశీలించానారు. గండిపోచమ్మ పాయింట్ నుంచి సర్ ఆర్థర్ కాటన్ పర్యాటక శాఖ బోటు నుంచి 40 మంది పర్యాటకులు, నలుగురు సిబ్బంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే 14 ప్రైవేటు బోట్లు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయి.
ఈ పాపికొండల విహారయాత్రకు.. రాజమహేంద్రవరం ఏపీ పర్యాటక శాఖ కార్యాలయం నుంచి ఉదయం 7.30 గంటలకు వాహనంలో బయలుదేరి వెళతారు పర్యాటకులు. అక్కడి నుంచి గండిపోచమ్మ బోటు పాయింట్కు చేరుకుని.. ఉదయం 9.30 గంటలకు యాత్ర మొదలై సాయంత్రం 5.30 గంటలకు మళ్లీ గండిపోచమ్మ పాయింట్కు తిరిగి వస్తారు. అక్కడి నుంచి బయల్దేరి వాహనంలో సాయంత్రం 7.30 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు.
ఈ పాపికొండలు విహారయాత్రకు సంబంధించిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. రాజమహేంద్రవరం నుంచి పెద్దలకు రూ.1250, పిల్లలకు (పదేళ్ల లోపు) రూ.1000గా నిర్ణయించారు. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి పెద్దలకు రూ.1000, పిల్లలకు (పదేళ్లలోపు) రూ.750గా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు 9848629341కు సంప్రదించాలని సూచించారు. మరోవైపు పాపికొండలు యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులు www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు రాజమహేంద్రవరం నుంచి ప్రైవేట్ బోట్ ట్రిప్లు అందుబాటులో ఉంటాయి. ఈ పాపికొండలు విహార యాత్రలో భాగంగా.. పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించొచ్చు. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహార యాత్ర కోసం నిత్యం వందలాదిమంది పర్యాటకులు వస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa