తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి పార్టీకి ఏమి న్యాయం చేస్తాడని మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా జగన్ నిజ స్వరూపం తెలుసుకొని ఒక్కొక్కరూగా బయటికి వెళ్తున్నారు. త్వరలో చాలా మంది నేతలు వైసీపీ నుంచి ఇతర పార్టీలలో చేరే అవకాశాలు ఉన్నాయని బాంబు పేల్చారు.తల్లి వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖతో వైసీపీ పరువు, ప్రతిష్టలు మంటగలిశాయని.. ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ అన్ని శాఖలను భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని నెరవేరుస్తూ.. ముందుకు వెళ్తోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు మాజీ సీఎం జగన్ పై 47 కేసులు ఉన్నాయని గంటా శ్రీనివాస్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa