భారత్లో నిర్మాణం చేసుకుంటున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఓ వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. నిర్మాణంలో ఉండగా.. కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే ఆ బ్రిడ్జిలోని పిల్లర్లు కూలిపోవడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు.. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరాు.
గుజరాత్లోని ఆనంద్ జిల్లాలోని వసాద్ ప్రాంతంలో ఈ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దేశంలోని తొలి బుల్లెట్ రైలు నడిచే అహ్మదాబాద్ ముంబై మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఓ వంతెనలోని కొంత భాగం నిర్మాణంలో ఉండగానే కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం నలుగురు కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరికొంతమంది గాయాల పాలయ్యారని.. వారిని ఆస్పత్రికి తరలించారు.
సంఘటనా స్థలంలో పోలీసులు, ఫైర్, ఇతర అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జి కూలిపోవడంతో దాని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి స్థానికులు కూడా సహాయం చేస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు దేశంలోని తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ మార్గం 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది.
ఆనంద్ జిల్లాలోని వల్సాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంక్రీట్ దిమ్మెల మధ్య నలుగురు కార్మికులు చిక్కుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఆనంద్ జిల్లా ఎస్పీ గౌరవ్ జాసాని వెల్లడించారు. శిథిలాల కింద నుంచి వెలికితీసిన ఇద్దర్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. స్టీల్, కాంక్రీటుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జి కూలిపోయిందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ తెలిపింది. వడోదరా సమీపంలో ఉన్న మహీ నదికి దగ్గరలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సహాయక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa