ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులకు సెలవులు దొరకడమే కష్టంగా మారింది. ఒక్క పూట లీవ్ తీసుకోవాలంటే ఆఫీస్లో బాస్ పర్మిషన్ కోసం వేచి చూడాల్సిందే. ఊర్లో తల్లిదండ్రులు, కుటుంబాన్ని వదిలేసి.. పట్నం వచ్చి తెల్లావారుజాము నుంచి అర్ధరాత్రి వరకు నైట్ షిఫ్ట్లు చేస్తూ ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అటు కుటుంబంతో ఊర్లో ఉండలేక.. ఇటు ఉద్యోగాన్ని వదిలేయలేక సతమతం అవుతున్నారు. పండగలు, పబ్బాలకు పక్కనపెడితే.. ఆరోగ్యం బాగాలేకపోయినా, తల్లిదండ్రులు అస్వస్థతకు గురైనా కనీసం చూడడానికి కూడా లీవులు దొరకక నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశంలో ఉన్న ఓ వ్యక్తి తన పెళ్లి కోసం లీవ్ అడిగినా.. కంపెనీ ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక.. వీడియో కాల్లోనే పెళ్లి చేసుకున్నాడు.
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్కు చెందిన అద్నాన్ ముహమ్మద్కు.. మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వివాహం నిశ్చయం అయింది. అయితే అద్నాన్ ముహమ్మద్ ఉద్యోగం నిమిత్తం వెళ్లి టర్కీలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్ 4వ తేదీన వారిద్దరి వివాహం నిర్వహించాలని రెండు కుటుంబాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే తనకు పెళ్లి ఉందని.. లీవు కావాలని అద్నాన్ ముహమ్మద్.. తన బాస్ను అడిగాడు. అయితే అందుకు అతని మేనేజర్ నిరాకరించాడు. లీవ్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశాడు. దీంతో చేసేదేమీ లేక.. అతడు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించాడు.
అయితే వారి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన కుటుంబ సభ్యులు ఎలాగైనా వివాహం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆన్లైన్లో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం అనారోగ్యంతో ఉన్న వధువు తాత చివరి కోరికను తీర్చేందుకు ఆ పెళ్లి వీలైనంత త్వరగా పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు ఈ పని చేశారు. ఈ క్రమంలోనే ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లోనే వారి పెళ్లి తంతు పూర్తి చేశారు. మండీలో నవంబర్ 4వ తేదీన (సోమవారం) వీడియో కాల్లో వారి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత అద్నాన్ కుటుంబం సంప్రదాయ ఊరేగింపును కూడా నిర్వహించారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa