అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. మోదవలస సమీపంలోని గొండయ్యపా లెం ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ 17ను ఆయన శనివారం సందర్శించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేశారు. ఓటర్ల సంఖ్య, దరఖాస్తులు తదితర అంశాలపై బీఎల్వోను ఆరా తీశారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించా లని ఆయన ఆదేశించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9, 10వ తేదీల్లో, అలాగే 23, 24 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రా ల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ తేదీల్లో బీఎల్వోలు ఇక్కడ అందుబాటులో ఉంటారని చెప్పారు. అనంతరం పాఠశాలలోని ఎండీఎం నిర్వహణపై ఆరా తీశారు. ఆర్వో వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నూకరాజు, తహసీల్దార్ పద్మావతి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa