తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించి మరణించిన డాక్టర్ సుధాకర్, కుండబద్ధలు సుబ్బారావు, పాలకుల అవినీతి, అరాచకాలను ఎండగట్టిన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు, డాక్టర్ పీవీ రమేష్ లను సామాజిక కార్యకర్తలంటారని అన్నారు. గత అసెంబ్లీలో సైకోలుగా వ్యవహరించిన కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి తదితరుల ప్రసంగాలను పరిశీలించి స్పీకర్ చర్యలు చేపట్టాలని కనపర్తి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa