ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు సీఎం చంద్రబాబు ఢిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు.అలాగే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సైతం ఆయన సమావేశం కానున్నారు. ఇక శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. ఎన్డీయే తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa