శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. శరణం అయ్యప్ప అనే భక్తుల శరణు ఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. అయ్యప్పకు ప్రీతికరమైన కార్తీక మాసం కావటంతో అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
తాజాగా శ్రీకాకుళం జిల్లా వాసులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం తూర్పు కోస్తా రైల్వే.. శ్రీకాకుళం నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు నడపనున్నారు. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ - కొల్లాం మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబర్ 1 నుంచి మొదలుకానుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 26 వరకూ ప్రతి ఆదివారం శ్రీకాకుళం రోడ్- కొల్లాం- శ్రీకాకుళం రోడ్ (08553-08554) రైలు అందుబాటులో ఉంటుంది.
మరోసారి పవన్ పవర్ఫుల్ పంచ్.. ప్రచారం చేసిన అన్నిచోట్లా మహాయుతి అభ్యర్థులు విజయం
శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి ఆదివారం ఉదయం ఆరింటికి బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు అంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొల్లాం నుంచి బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు అంటే మంగళవారం ఆర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు తిరిగి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. శబరిమల అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తూర్పు కోస్తా రైల్వే అధికారులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపుతోంది. ఈ విషయాన్ని శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు తెలిపారు, సూపర్ లగ్జరీ సర్వీసులతో పాటుగా, ఆల్ట్రా డీలక్స్ బస్సులు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. శబరిమలకు వెళ్లాలనుకునే వారు తమను సంప్రదించాలని ఓ ప్రకటనలో కోరారు. అలాగే బస్సు మొత్తం బుక్ చేసుకుంటే.. ఏడుగురికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు బంపరాఫర్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa