దేశానికి నేడు బౌద్ధధర్మం అవసరం ఎంతో ఉందని, సమాజంలో మానవతా విలు వలు, మంచి దానితోనే సాధ్యపడుతుందని రిటై ర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ పేర్కొన్నా రు. ఆదివారం ఒంగోలులోని అంబేడ్కర్ భవ నంలో 68వ బౌద్ధ ధర్మ దీక్ష ఉత్సవం ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఇ.మహేష్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథు లుగా మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్, రాష్ట్ర అధ్యక్షులు వై.హరిబాబు హాజరయ్యారు.
ముందుగా విజయ్కుమార్ మాట్లాడుతూ బౌద్ధ మతం లేకపోతే దేశంలో అసమానతలు విచ్ఛిన్న మై సమాజమే శిథిలావ స్థకు చేరుకునే ప్రమాదం ఉందన్నారు. బుద్దిజం ద్వారానే మనిషికి ప్రజ్ఞ, శీల, కరుణ అనేవి వ స్తా యని తెలిపారు. బీసీకే రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే.వి ద్యాసాగర్ మాట్లాడుతూ నిజమైన సమాజాభి వృద్ధి కావాలంటే బౌద్ధం చాలా అవసరమని పేర్కొన్నారు. ముందుగా మిరియాలపాలెం నుం చి అంబేడ్కర్ భవనం వరకు భారీ ర్యాలీ ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వీవీ.దుర్గారావు, జాతీయ కార్యదర్శి వై.కొం డలరావు, జాతీయ సభ్యులు ఇ.నాగేశ్వరరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి రాంబాబు, జిల్లా కో ఆర్డినేటర్ బి.రాజేష్, కె.అనీల్, కె.రామకృష్ణ, వై.సిద్ధార్ధ, అంబేద్కరిస్ట్లు, విద్యార్థులు పాల్గొ న్నారు. అనంతరం పలువురు బౌద్ధ దీక్షను స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa