సగర సంఘం అభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని చట్రెడ్డిపల్లె సమీపంలో శ్రీభగీరథస్వామి ఆలయ ఆవరణలో సగర సంఘం వనభోజన మహోత్స వాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, అన్ని రంగాలలో వారిని ముందుకు తీసుకు పోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రాబాబు లక్ష్యమని తెలిపారు. సగర సంఘంకు అన్ని విధాలుగా తాను సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa