కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో కోనసీమకు చెందిన ఒక మాజీ మంత్రి, అతని తనయుడు అరెస్ట్ కావడం చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్ ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ది అవగాహన రాహిత్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు.కాగా.. గతంలోవలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడి ప్రమేయం ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన ఆరోపణలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి సుభాష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సుభాష్ మాట్లాడుతూ.... హత్య జరిగిన తర్వాత బాధితుడు ఇంటికి విశ్వరూప్ వెళ్లారని ఆరోపించారు. కేసు పెట్టకుండా ఉండేందుకు 2 ఎకరాలు ఇస్తానని చెప్పారని ఆరోపణలు చేశారు. ఆ కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకుండా తన మంత్రి పదవిని విశ్వరూప్ అడ్డం పెట్టుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు.హత్యకు గురైన వలంటీర్కు విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్తో అనుబంధం ఉందని విమర్శించారు అందుకే తన కొడుకుకి శ్రీకాంత్ పేరు కూడా పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత బాధితుల్లో ధైర్యం వచ్చి తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరారు. బాధితురాలిని పోలీసు ఉన్నతాధికారుల వద్దకు తీసుకు వెళ్లానని అన్నారు. విచారణ చేయించి బాద్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa