ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 07:12 PM

వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ విస్తృతంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైయ‌స్‌ జగన్ దిశానిర్దేశం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ లేదు, సూపర్‌ సెవెన్‌ లేదు.. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపతీరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేక ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. సూపర్‌ సిక్స్‌ లేదు, సూపర్‌ సెవెన్‌ లేదు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.


రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, దిగజారిపోయాయి. మొట్టమొదటి సారిగా మూడు త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉంది. జనవరి వస్తే ఏకంగా రూ.2800 కోట్లు పెండింగ్ అవుతుంది.  వసతీ దీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్‌. ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెప్తున్నారు. పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఉన్నాయి. దాదాపు తొమ్మిది నెలల బిల్లులు పెండింగులో ఉన్నాయి. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. 108, 104 ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు.రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ-క్రాప్‌ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేవాళ్లు. ప్రతీ రైతుకూ మద్దతు ధర వచ్చేది. జీఎల్‌టీ ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. అదనంగా ప్రతీ ఎకరాకు అదనంగా రూ.10వేలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు మొదలైంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల వడ్డన ప్రారంభమైంది. మరో రూ.9వేల కోట్ల వడ్డన వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయి బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com