ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలుడిని కిడ్నాప్‌ చేసిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:12 PM

ఇంటి వద్ద ఉన్న పది నెలల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్‌ చేసింది. శుక్రవారం ఒంగోలు నగరంలోని ప్రగతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు ఒడిశాకు చెందిన ప్రదీప్‌ సునానీ మూడేళ్లుగా ఒంగోలు కార్‌ కేర్‌లో పనిచేస్తున్నాడు. స్థానిక ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాలో ఉంటున్న భార్య ఊర్వశి, పది నెలల కుమారుడు మహీర్‌ను నెల క్రితం ఒంగోలు తీసుకువచ్చాడు. వారి పక్కింట్లోనే దయామణి అనే మహిళ నివసిస్తోంది. నిత్యం ఆమె బాలుడిని ఆడిస్తుంటుంది. రోజూ మాదిరిగానే శుక్ర వారం ఉదయం మహీర్‌ను ఆడించేందుకు తీసుకెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు పిల్లాడి కోసం వెతకగా ఇద్దరూ కనిపించలేదు.


దయామణికి సంబంధించిన దుస్తులు, వస్తువులు కూడా ఆమె ఇంట్లో లేవు. దీంతో బాలుడిని కిడ్నాప్‌ చేసిందని అనుమానించిన తల్లిదండ్రులు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు నేతృత్వంలో ఐదు బృందాలు బాలుడి కోసం గాలిస్తు న్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీని సేకరి స్తున్నాయి. దయామణి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. కాగా తమ కుమారుడు కనిపిస్తే చెప్పండి అంటూ మహీర్‌ తల్లిదండ్రులు బాలుడి ఫొటో చూపిస్తూ నగరంలోని వీధుల వెంట తిరుగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa