ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024కి అంతర్జాతీయ స్థాయిలో స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్కు మరో అంతర్జాతీయ పరిశ్రమ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఏపీలో ఎస్ఏఈఎల్ 1200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణం చేపట్టనుంది. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎస్ఏఈఎల్ ప్రతినిధులు ఇటీవల ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, చెత్త నుంచి విద్యుత్ తయారీ కార్యక్రమాలు, సోలార్ ప్యానెళ్ల తయారీ రంగం గురించి చర్చించారు. అనంతరం ఏపీలో 1200 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టు చేపట్టాలని ఎస్ఏఈఎల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
అనంతరం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో స్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు శనివారం భేటీ అయ్యారు. ఈ విషయాన్ని నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ ఎండీ సుఖ్బీర్ సింగ్తో భేటీ జరిగిందన్న నారా లోకేష్.. ఏపీలో ఎస్ఏఈఎల్ రెండు దశల్లో 1200 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తొలివిడతగా 600 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చిందన్న నారా లోకేష్.. ఈ పాలసీ తెచ్చిన తర్వాత వస్తున్న తొలి ప్రాజెక్టు ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్రణాళికపైనా ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో చర్చించామన్న నారా లోకేష్.. వ్యవసాయ వ్యర్ధాలను ఉపయోగించి విద్యుత్ తయారు చేసే అంశంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీబీ బ్యాంక్ ప్రతినిధులతోనూ నారా లోకేష్ భేటీ అయ్యారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనూ ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో చంద్రబాబును కలిసిన ఎన్డీబీ బ్యాంక్, ఎస్ఏఈఎల్ ప్రతినిధులు వివిధ అంశాలపై చంద్రబాబుతో చర్చించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లీడింగ్ కంపెనీలు అయిన ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో భేటీ కావటం సంతోషంగా ఉందన్న సీఎం చంద్రబాబు.. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa