ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టే బహిష్కరించాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:40 AM

సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేకపోవడం వల్లనే కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేసిందని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో, తాము ఎన్నికలను బహిష్కరించామని ఆయన వెల్లడించారు. అలా ఈ ఎన్నికల్లో గెల్చి, అదేదో తమ గొప్ప విజయం అన్నట్లుగా పులివెందుల మాజీ ఎమ్మెల్సీ చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల సినిమాకు స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌.. చివరకు ప్రేక్షకుడు, ఆ సినిమాపై రివ్యూ కూడా ఇచ్చేది మాజీ ఎమ్మెల్సీ బిటెక్‌ రవి. సాగునీటి సంఘాల ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయన్నది.. గడచిన రెండు, మూడు రోజులుగా ఈ ఎన్నికల ప్రహసనం ఎలా కొనసాగిందో మీరంతా చూశారు. నీటిపారుదల శాఖ ఈ సంఘాల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎవరైనా రైతులు ఈ ఎన్నికల్లో టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యుడిగా పోటీ చేయాలనుకుంటే, నీటి బకాయిలు పూర్తిగా చెల్లించి ఉండాలి. ఆ మేరకు వీఆర్‌ఓ నుంచి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. ఇది తప్పనిసరి. అది ఉంటేనే నామినేషన్‌ అనుమతిస్తారు. లేకపోతే రిజెక్ట్‌ చేస్తారు. అది టీడీపీ ప్రభుత్వం పెట్టిన నిబంధన. ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వీఆర్‌ఓలు అంతా గ్రామ సచివాలయాల్లో ఉండాలి. కానీ చాలా మంది వీఆర్‌ఓలు ఫోన్లు స్విచాఫ్‌ చేసి కూర్చున్నారు. ఇంకా అందరు వీఆర్‌ఓలను మండల ఆఫీస్‌కు తీసుకుపోయి, నిర్భంధం చేశారు. బయట పోలీసులను కాపలగా పెట్టారు. వారిని రెండు రోజుల పాటు మండల ఆఫీస్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? వారిని అక్కడ జైల్లో ఖైదీలుగా ఉంచినట్లు ఉంచారు. ఏ రైతు కూడా తమ వీఆర్‌ఓను కలిసే వీలు లేకుండా చేశారు. అలా వీఆర్‌ఓలు ఆ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కుట్ర చేశారు అని మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa